శుభ ముహూర్తంలో.. ఆంజనేయుడి దయ వల్ల ఆడ బిడ్డ పుట్టింది : చిరంజీవి

శుభ ముహూర్తంలో.. ఆంజనేయుడి దయ వల్ల ఆడ బిడ్డ పుట్టింది : చిరంజీవి

రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ ఉదయం అపోలో ఆస్పత్రి  ఎదుట మాట్లాడిన ఆయన.. చరణ్ దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడం ఇంటిల్లిపాది సంతోషంగా ఉందన్నారు.  రామ్ చరణ్ ఉపాసన్ తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని.. ఆ భగవంతుని దయ, అందరి  ఆశీస్సుల వల్ల అది సాధ్యమయ్యిందన్నారు.  తమకు విషెస్ చెబుతున్న వారికి  ధన్యవాదాలు తెలిపారు.

  
జూన్ 20న ఉదయం 1.49 నిముషాలకు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు  ఆడబిడ్డ పుట్టిందన్నారు చిరంజీవి. మంగళవారం మంచి ఘడియలని.. ఆంజనేయస్వామికి చాలా కీలకమని.. ఆయనను నమ్ముకున్న తమకు ఆడబిడ్డ పుట్టడం అపూరూపంగా భావిస్తున్నామన్నారు. అపోలో బృందం దగ్గరుండి ఉపాసనకు ప్రసవం చేశారని..తల్లీ బిడ్డ క్షేమంగా ఉందని చెప్పారు.  

మనవరాలికి ఎవరి పోలికలు వచ్చాయని మీడియా అడగ్గా..అది ఇపుడే  చెప్పలేమన్నారు చిరంజీవి. కొన్ని రోజులుగా మెగా ఇంట అన్ని శుభకార్యాలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరుణ్ తేజ ఎంగేజ్ మెంట్ కానీ..ఇవాళ ఆడబిడ్డ జన్మనివ్వడం గానీ ఆనందంగా ఉందన్నారు. ఇవాళ ఉదయమే లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతమంటూ చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.