ఆ రోజు రాత్రి నిద్రపోలేదు : చిరంజీవి

ఆ రోజు రాత్రి నిద్రపోలేదు : చిరంజీవి

గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కు ముందు రోజు తన భార్య సురేఖ చాలా డల్ అయిందని.. తాను కూడా ఆ రోజు రాత్రి నిద్రపోలేదని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో చిరంజీవి తోపాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. కొన్ని సార్లు సూపర్ హిట్ అనుకున్న మూవీ కూడా ప్లాప్ అవుతుందని తెలిపారు. ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత కష్టపడినా ప్రతి సినిమా ఒక యూనిక్ గా ఉంటుందని.. కానీ సినిమాపై కొంచెం తేడాగా టాక్ వచ్చినా బాధవేస్తుందన్నారు. ఇంద్ర, ఠాగూర్ తర్వాత... అంత పవర్ ఫుల్ సినిమా ఇదని.. గాడ్ ఫాదర్ సినిమా తనకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది అన్నారు. థియేటర్స్ కి రానివారిని కూడా థియేటర్స్ కి రప్పించే సినిమా ఇదని చిరు అన్నారు. బ్లాక్ బాస్టర్స్ సినిమాస్ తో పోలుస్తూ.. నా సినిమాని ఆ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకి మెగాస్టార్ ధన్యవాదాలు తెలిపారు.

-కంటెంట్ ఉన్న సినిమాలను అభిమానులు ఆదరిస్తారని ముందునుంచి చెప్తూనే ఉన్నానని చిరంజీవి గుర్తు చేశారు. తన సినిమాలని కూడా చిరు బయట వ్యక్తిలాగే చూస్తానని తెలిపారు. అప్పుడే మూవీలో ఉన్న తప్పుఒప్పులు తెలుస్తాయన్నారు. మనం స్క్రీన్ మీద ఎలా ఉండాలో మనకంటే ఎక్కువగా మన అభిమానులకే తెలుస్తుందని చెప్పారు. ఈ సినిమాకి తమన్ ఆరో ప్రాణం అవ్వాలి అని అన్నానని.. అది తమన్ నిలబెట్టికున్నాడని చిరు ప్రశంసించారు. ఇక సత్యదేవ్ యాక్టింగ్ ఈ సినిమాకి ఒక పిల్లర్ అని..నయనతారతో పాటు షఫీ, సునీల్ చాలా బాగా యాక్టింగ్ చేశారని చిరు అన్నారు.

కాగా, మీడియాల్లో వస్తున్న కొన్ని వార్తలు చిరాకు తెప్పిస్తున్నాయని చిరంజీవి తెలిపారు. మేము ఏం చెయ్యాలో కూడా మీడియానే చెప్తుందని అన్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ లో వర్షంలో ఈవెంట్ రసాభాస అయింది అని ఎక్కడా రాస్తారో అని తానే వర్షంలో మాట్లాడానని.. ఈవెంట్ ని సక్సెస్ చేశాని చిరు తెలిపారు.తనను ఇష్టపడే మీడియా, ఇష్టపడని మీడియా కూడా పాజిటీవ్ గా న్యూస్ రాసిందిని వెల్లడించారు. ప్రతి మీడియా అత్యద్బుతంగా రాసినందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను అని చిరు అన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటించారు. ఇందులో సర్వదామన్ బెనర్జీ, తాన్య రవిచంద్రన్, సునీల్, దివి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించగా రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు ఉన్న మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.