టాలీవుడ్ కార్మికుల కోసం రూ. 1.8 కోట్ల సాయం చేసిన అమితాబ్

టాలీవుడ్ కార్మికుల కోసం రూ. 1.8 కోట్ల సాయం చేసిన అమితాబ్

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ రూ.1.8 కోట్ల సాయం చేశారు. సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)’ కి ఈ సాయాన్ని అంద‌జేశారు. ఇదే విష‌యాన్ని చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ అమితాబ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

“అమితాబ్ గారు, రూ.1500 విలువైన 12 వేల రిలీఫ్ కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం అందించారు. వాటిని మేం పంచిపెడతాం. ఇంత చక్కని నిర్ణయం తీసుకున్నందుకు ‘బిగ్ బీ‘కి బిగ్ థ్యాంక్స్. ఈ కూపన్లతో బిగ్ బజార్ స్టోర్లలో కొనుగోళ్లు చేయొచ్చు..’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ లేని సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఏర్పాటు చేసిన స‌హాయ‌నిధికి ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విరాళాలు అంద‌జేశారు. తాజాగా బిగ్ బీ కూడా త‌న వంతు సాయం అందించారు.