‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్, సాయి ధరమ్ హెల్త్‌పై చిరు ట్వీట్

‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్, సాయి ధరమ్ హెల్త్‌పై చిరు ట్వీట్

హైదరాబాద్: రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సాయి తేజ్ త్వరగా కోలుకుంటున్నారని అన్నారు. సాయి ఆరోగ్యంతోపాటు ఆయన నటించిన రిపబ్లిక్ మూవీ రిలీజ్‌పై చిరు ట్వీట్ చేశారు. ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు.. అదే తేదీన మూవీ రిలీజ్ అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్‌‌కు శ్రీరామ రక్ష’ అని ట్వీట్‌లో చిరు పేర్కొన్నారు.