చిరంజీవి నుండి రాబోతున్న కొత్త చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్పై భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్పై ఫోకస్ పెట్టారు టీమ్.
గురువారం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. జూన్ చివరి వారానికి షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వీకెండ్తో పాటు పంద్రాగస్టు కలిసొచ్చేలా ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేయనున్నారు. చిరంజీవి మాస్ గెటప్లో స్టైలిష్గా కనిపిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
మెగాస్టార్కి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది. సుశాంత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు.