
అత్యాచారంలో కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. గతేడాది నవంబర్ 7 న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిని మదనపల్లి మండలానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి ఆపై హత మార్చాడు. చిన్నారి అదృశ్యమవ్వడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా నిందితుడు రఫీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..హత్య, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవ్వాళ అత్యాచారం సంబంధించి చిత్తూరు సెషన్స్ కోర్ట్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాధ్ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా 41 మంది సాక్షుల్ని విచారణ చేపట్టిన న్యాయమూర్తి లారీ డ్రైవర్ రఫీని దోషిగా తేల్చుతూ ఉరిశిక్ష విధించాలని తీర్పిచ్చారు. అయితే ఉరిశిక్షతో తన కుటుంబం దిక్కులేనిది అవుతుందని రఫి న్యాయమూర్తికి చెప్పగా..దిశ యాక్ట్ ప్రకారం అత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష విధిస్తామంటూ తుది తీర్పిచ్చారు.