క్లోరోక్విన్: వరల్డ్​ నెంబర్ 1 ఇండియా

క్లోరోక్విన్: వరల్డ్​ నెంబర్ 1 ఇండియా

న్యూఢిల్లీ: క్లోరోక్విన్.. ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్ ఈ మందే. కరోనా రాకుండా జాగ్రత్త కోసం దీనిని వాడుతున్నారు. ఈ మందును ప్రపంచంలో ఎక్కువగా తయారు చేస్తున్నది, వేరే దేశాలకు ఇస్తున్నది మన దేశమే. అంటే క్లోరోక్విన్కు వరల్డ్​ నెంబర్ 1 ఇండియా. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి దాకా దేశం నుంచి 1,900 కోట్లడాలర్ల(సుమారు రూ.1.44 లక్షల కోట్లు) విలువైన మందులు ఎగుమతి
అయితే, అందులో క్లోరోక్విన్ వాటా సుమారు రూ.9,25 0 కోట్లు ( 122 కోట్లడాలర్లు). కరోనా ఎఫెక్ట్ తో​ దాని ఎగుమతిపై కేంద్రం కొద్ది రోజుల క్రితం ఆంక్షలు పెట్టింది.

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​ కోరడంతో బ్యాన్ పై రూల్స్​ను సడలించింది. అయితే, మన కోసం ప్రత్యేకంగా 10 కోట్ల ట్యాబ్లెట్లను తయారు చేయిస్తోంది. క్లోరోక్విన్​ను చైనా తయారు చేయకపోవడం వల్ల, చాలా దేశాలు ఆ మందుపై ఇండియా మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం దేశంలో ప్రతి నెలా 40 టన్నుల (20 కోట్ల) ట్యాబ్లెట్లు తయారవుతున్నాయి. డిమాండ్ ఉంటే ఒక్కోసారి నెలకు 35 కోట్ల ట్యాబ్లెట్లూ తయారవుతుంటాయి. వచ్చే నెల నాటికి ప్రొడక్షన్ కెపాసిటీని 70 కోట్లకు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి.

లాక్ డౌన్ ఒకేసారి ఎత్తుయలేం..

ప్రధాని మోడీజీ..మీరు చాలా గ్రేట్

మందు దొరక్క నటి కొడుకు నిద్ర మాత్రలు మింగాడు