తరిగిన ఫ్రూట్స్​ రంగు మారకుండా..

తరిగిన ఫ్రూట్స్​ రంగు మారకుండా..

​పిల్లలకి లంచ్​ బాక్స్​లో ఫ్రూట్స్​ పెట్టిస్తారు చాలామంది పేరెంట్స్​. పెద్దవాళ్లు ఆఫీస్​కి  శ్నాక్స్​గా ఫ్రూట్స్​ పట్టుకెళ్తారు. తీరా వాటిని తినే టైంకి అవి ఫ్రెష్​గా ఉండవు. యాపిల్, జామ , పియర్స్​ వంటి పండ్లు తరిగిన  అరగంటకే  రంగు మారతాయి. వాటి రుచి కూడా మారిపోతుంది. మరి దీనికి సొల్యూషన్​ ఏంటి?  తరిగిన ఫ్రూట్స్ అలాకాకుండా  ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఫ్రూట్స్​ రంగు మారడానికి కారణాలు ఏంటి?  తరిగిన ఐదు నుంచి పదినిమిషాలకే యాపిల్, జామ, పియర్స్​ లాంటి ఫ్రూట్స్​ రంగు మారడానికి రెండు కారణాలున్నాయి.  ఫ్రూట్స్​కి గాలి తగిలినప్పుడు, గాల్లోని మాయిశ్చరైజర్​  వాటి ​ రంగుని, టేస్ట్​ని మారుస్తుంది. అలాగే, తరిగిన వెంటనే ఫ్రూట్స్ ఎంజైమ్స్​ని రిలీజ్​ చేస్తాయి. ఆ ఎంజైమెటిక్​ రియాక్షన్స్​​ వల్ల ఫ్రూట్స్  ఎక్కువసేపు గాలికి ఉన్నా,  డబ్బాల్లో స్టోర్​ చేసినా రంగు మారతాయి.

 ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. 
ఫ్రూట్స్ తరిగాక చల్లటి నీళ్లలో 30 సెకన్లు ఉంచాలి. దీనివల్ల ఎంజైమెటిక్​ రియాక్షన్​  స్లో అవుతుంది. లేదా పూర్తిగా కంట్రోల్​ అవుతుంది. దాంతో ఫ్రూట్స్​ ఎన్నిగంటలైనా రంగు మారవు. 
తరిగిన ఫ్రూట్స్​ రంగు మారకూడదంటే ఉప్పు నీళ్లు ​ బెస్ట్​ ఆప్షన్​​. ఒక గిన్నెలో సగానికి  పైగా చన్నీళ్లు పోసి, అర టీ స్పూన్​ ఉప్పు కలపాలి. అందులో రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రూట్స్​ ఉంచితే ఎక్కువ సేపు  ఫ్రెష్​గా ఉంటాయి. ఫ్రూట్స్​ని చన్నీళ్లలో కాసేపు ఉంచి, అల్లం జ్యూస్​లో ముంచినా ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి. అల్లం జ్యూస్​లోని ఎడిబుల్​ సిట్రిక్​ యాసిడ్ ఫ్రూట్స్​ని ఆక్సిడేషన్​ నుంచి బయటపడేసి, మెత్తగా కానీయవు. యాపిల్​, జామ, పియర్​ ముక్కల్ని స్టోర్ చేసేముందు తేనె కలిపిన  గోరు వెచ్చని నీళ్లలో  కాసేపు ఉంచాలి.  ముక్కలకి తేనె బాగా పట్టాక డబ్బాలో పెట్టాలి. దీనివల్ల ఫ్రూట్స్​ రంగు మారకపోగా... ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు రుచిగా ఉంటాయి.  ఫ్రూట్స్​ని ఫ్రెష్​గా ఉంచడంలో నిమ్మరసం, పైనాపిల్​, సంత్రా లాంటి సిట్రస్​ ఫ్రూట్స్​ బాగా పనిచేస్తాయి. సిట్రస్​ జ్యూస్​లో  కొంచెం నీళ్లు లేదా తేనె వేసి బాగా కలపాలి. అందులో తరిగిన ఫ్రూట్స్​ని కాసేపు ఉంచితే ఎన్ని 
 గంటలైనా ఫ్రెష్​గా ఉంటాయి.