
చేర్యాల, వెలుగు: మండల కేంద్రంలోని పలు సీడ్స్అండ్ ఫర్టిలైజర్స్షాపుల్లో సీఐ శ్రీను ఆధ్వర్యంలోని పోలీసుల బృందం, మండల వ్యవసాయాధికారులు కలిసి శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎరువులు, పురుగు మందులు, కొనేటప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు.
స్టాక్, డెలివరీ రిజిస్టర్లు, బిల్బుక్ రికార్డులను తనిఖీ చేసి షాప్లో ఉన్న సీడ్స్, ఫర్టిలైజర్బస్తాలను పరిశీలించారు. రైతులు అప్రమత్తంగా ఉండి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనాలని ఏదైనా అనుమానం వస్తే 100కు డయల్చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో భోగేశ్వర్, ఏఈవో ప్రవీణ్, రవలి, ప్రొహిబిషన్ఎస్ఐ సమత పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
కోహెడ (హుస్నాబాద్): నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. హుస్నాబాద్లో సీడ్స్, ఫర్టిలైజర్ షాపులను ఏవో శ్రేయతో కలిసి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు.