
ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అగ్రి టెక్ సౌత్ 2024 సదస్సు నాలుగో ఎడిషన్ను నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్లో వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధిని సాధించడం లక్ష్యం. దాంతోపాటు వ్యవసాయ రంగంలో వస్తున్న అత్యాధునిక పరిణామాలపై రెండు రోజుల సదస్సు - అగ్రోవిజన్ 2024 కూడా ఉంటుంది.
ఈ కార్యక్రమం ఫిబ్రవరి 16 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుంది. పంట మార్పిడి, సూక్ష్మ నీటి పారుదల, సమీకృత వ్యవసాయ పద్ధతులు, ఈ–-నామ్, బీమా, వ్యవసాయ పరికరాలు, పొలం పనుల యాంత్రీకరణ, కోత అనంతర నిర్వహణ , డ్రోన్లను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు.