
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ అప్లికేషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 425, అమరావతి సర్కిల్లో 400 ఖాళీలున్నాయి.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. వయసు 31 అక్టోబర్ 2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.36,000 నుంచి -రూ.63,840 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. తుది ఎంపికలో ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కు రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష జనవరిలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.