ఓల్డ్సిటీ, వెలుగు: మహాత్మా గాంధీ బస్ స్టేషన్లోని ఆటో స్టాండ్ను తొలగించవద్దని సీఐటీయూ కార్యదర్శి శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎంజీబీఎస్ లో ఆటో యూనియన్సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 150 మంది ఆటో డైవర్ల జీవన ఉపాధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఊబర్, ఓలా, ర్యాపిడోతో ఉపాధి కోల్పోతున్న తమను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. సమావేశంలో మహ్మద్బాబా, కోటయ్య, జంగయ్య పాల్గొన్నారు.
