మల్లంపల్లిలో అభ్యర్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం

మల్లంపల్లిలో అభ్యర్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం

ములుగు, వెలుగు: మల్లంపల్లి మండల కేంద్రంలో సోమవారం నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. మండలంలోని మహ్మద్​ గౌస్​ పల్లి గ్రామానికి చెందిన పది వార్డులు, సర్పంచ్​ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్​ కేంద్రానికి వచ్చి నామినేషన్​ పత్రాలు తీసుకునే సందర్భంలో, ఎక్కువ మంది లోపలికి రావొద్దంటూ పోలీసులు నిలువరించారు.

ఈక్రమంలో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు జోక్యం చేసుకొని సముదాయించారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్​ మండలాల్లో మంగళవారంతో నామినేషన్​ ప్రక్రియ ముగియనుంది.