ఇరువర్గాల మధ్య ఘర్షణ ..హెడ్ కానిస్టేబుల్ కు గాయాలు.. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన

ఇరువర్గాల మధ్య ఘర్షణ ..హెడ్ కానిస్టేబుల్ కు గాయాలు.. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన

కూసుమంచి, వెలుగు: పోలీస్​ స్టేషన్​ ఆవరణలో సోమవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను అడ్డుకునేందుకు యత్నించిన హెడ్​ కానిస్టేబుల్​కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై జగదీశ్​​తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం తిరుమలాయపాలెం మండలం గోల్​తండాకు చెందిన బోడ కీర్తన అదృశ్యమైనట్లు ఆమె పేరెంట్స్​ ఫిర్యాదు చేశారు. 

ఇదిలాఉంటే ఆమె మహబూబాద్​ జిల్లా డోర్నకల్​ మండలం కొత్త తండాకు చెందిన ఆంగోత్​ నవీన్​ప్రేమించుకొని పెండ్లి చేసుకున్నారు. సోమవారం వారు పోలీస్​స్టేషన్​కు రాగా, అమ్మాయి, అబ్బాయి బంధువులు ఘర్షణకు దిగారు. వారిని విడిపించేందుకు వెళ్లిన హెడ్​ కానిస్టేబుల్​ గుగులోతు నవీన్ ను తోసి వేయడంతో తల గోడకు తగిలి తీవ్రగాయాలయ్యాయి.