ఆళ్లపాడులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

ఆళ్లపాడులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

మధిర, వెలుగు:  ఖమ్మం జిల్లా బోనకల్​మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో  మంగళవారం కాంగ్రెస్ , బీఆర్ఎస్, సీపీఎం కూటమి కార్యకర్తల మధ్య  ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.  ఆళ్లపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, -సీపీఎం కూటమి అభ్యర్ధి సర్పంచ్​గా విజయం సాధించారు. వారు సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్​నాయకుడు మల్లాది లింగయ్య మంగళవారం తన ఇంటి ముందు నిలబడి  తిడుతుండగా బీఆర్​ఎస్​, సీపీఎం కూటమి నాయకులు ఎవరిని తిడుతున్నావని ప్రశ్నించిన క్రమంలో  ఘర్షణ వాతావారణం చోటు చేసుకుంది.  

ఈ ఘర్షణకు దారితీసింది. కాంగ్రెస్​ నాయకులు మల్లాది లింగయ్య, ఉపేందర్, కొండ, వెంకయ్య బీఆర్​ఎస్, సీపీఎం కూటమి నాయకులు శ్రీకాంత్ పవన్, ఉదయ్​కిరణ్, చెన్నకేశి వేణుపై దాడి చేయగా గాయాలైనట్లు బాధితులు బోనకల్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బోనకల్లు ఎస్సై పొదిలి వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.