ఎర్రవెల్లిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ

ఎర్రవెల్లిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎర్రవెల్లిలో రేపు కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించనుంది. ఆ కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఎర్రవెల్లి వెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్తలను, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. 

 

https://www.youtube.com/watch?v=RX2Ryz7QfWU