మహబూబాబాద్ బీఆర్ఎస్​లో భగ్గుమన్న విభేదాలు..

మహబూబాబాద్ బీఆర్ఎస్​లో భగ్గుమన్న విభేదాలు..

మహబూబాబాద్  బీఆర్​ఎస్ పార్టీలో మరోసారి వర్గ పోరు  భగ్గుమంది. నెల్లికుదుర్ మండలంలోని ఓ మామిడి తోటలో  బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. 

దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు..ఇరువర్గాలను సముదాయించారు. తర్వాత ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమకు వద్దంటూ ఎంఎల్​సీ  వర్గం సమావేశం ఏర్పాటు చేసింది. వారు.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమకు వద్దంటూ... వచ్చే ఎన్నికల్లో , కొత్త అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో ఆ ఏరియాలో పొలిటికల్​ హీట్​ పెరిగింది.