వెలుగు, నెట్వర్క్: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆఫీసర్లు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిలో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లో ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అంకిత్ హాజరై గ్రామాల అభివృద్ధిపై మాట్లాడారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ సత్యశారద పాల్గొని రైతులు పంట మార్పిడికి సహకరించాలని, గ్రామ పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, సర్నిర్వహణపై అవగాహన కల్పించారు. నల్లబెల్లి మండలం పంతులుపల్లిలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి పాల్గొని మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పెరగూడెంలో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ స్నేహశబరీశ్పాల్గొని గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో నిర్వహించిన గ్రామసభలో సీపీ సునీల్దత్మాట్లాడుతూ హెల్మెట్, సీట్బెల్ట్తో ప్రాణాలకు రక్షణ అని సూచించారు. ధర్మతండాకు చెందిన అక్క, తమ్ముడు రోడ్డు ప్రమాదం అరుగగా, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. జూలూరుపాడులో ఎస్పీ రోహిత్రాజ్, సంగెం మండలం రామచంద్రాపురంలో మామునూర్ ఏసీపీ వెంకటేశ్, గోవిందరావుపేట మండలం పస్రాలో సీఐ దయాకర్పాల్గొని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
