అల్లరికి హద్దుండాలి .. అమ్మాయి వాటర్ బాటిల్ లో మూత్రం పోశారు..

అల్లరికి హద్దుండాలి .. అమ్మాయి వాటర్ బాటిల్ లో మూత్రం పోశారు..

రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలో  అమానుష ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో  ఓ విద్యార్థిని వాటర్ బాటిల్ లో   కొందరు సీనియర్ స్టూడెంట్స్  మూత్రం పోశారు. అంతేగాకుండా ఆమె బ్యాగులో ఐ లవ్ యూ అని రాశారు. అయితే బాటిల్ లో మూత్రం పోసిన విషయం తెలియక ఆ అమ్మాయి వాటర్ తాగింది.  వాసన రావడంతో హెచ్ఎంకు కంప్లైంట్ చేసింది. అయినా ఎలాంటి చర్యలు  తీసుకోకపోవడంతో ఆ విద్యార్థిని  పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.  ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఉన్న ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. 

జులై 27న  రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని ప్రభుత్వ సీనియర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన విద్యార్థిని  బాటిల్‌లో కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ మూత్రాన్ని నీటిలో కలిపారు.  తర్వాత పొరపాటున ఆమె మూత్రం తాగింది.  ఆ నీళ్లు తాగిన తర్వాత వాసన రావడంతో ఆమె గుర్తించింది. విద్యార్థిని బ్యాగ్‌లో ఐ లవ్ యూ అని రాసి  ఉందని పోలీసులు తెలిపారు. 

విద్యార్థి ఇంకా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని ASP ఘనశ్యామ్ శర్మ తెలిపారు.  నిందితుల ప్రాంతంలోకి ప్రవేశించి రాళ్లదాడికి పాల్పడిన వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రస్తుతం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఘనశ్యామ్ శర్మ భారీ పోలీసు బలగాలతో లుహారియా గ్రామంలో ఉన్నారు.