ఈ నెల 31వరకు రెస్టారెంట్ల మూసివేత

ఈ నెల 31వరకు రెస్టారెంట్ల మూసివేత

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలోని అన్ని రెస్టారెంట్లనూ ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆదేశించింది. సామాజిక కార్యక్రమాల్లో  20 మందికి మించి పాల్గొనరాదని ఆదేశించింది. 31వరకూ ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లనూ మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రెస్టారెంట్లలో టిఫిన్, భోజనం తినడంపై నిషేధం విధించినట్లు చెప్పారు.