తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్.. సీఎం చంద్రబాబు

తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్.. సీఎం చంద్రబాబు

కడపలో టీడీపీ మహానాడు ప్రతినిధుల సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని అన్నారు చంద్రబాబు.పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం,రూ.2కి కిలో బియ్యం, సబ్సిడీ కరెంటు టీడీపీ తెచ్చినవేనని అన్నారు. అన్ని ప్రాంతాలు, అన్నివర్గాల అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని అన్నారు. టీడీపీ కార్యకర్తలే తన ఆయుధాలని.. కార్యకర్తలతో కలిసి ఆకాశమేహద్దుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

రాష్ట్రం ఫస్ట్ అనేది టీడీపీ సంకల్పమని.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది టీడీపీనే అని అన్నారు. ఏపార్టీ చూసినా టీడీపీ యూనివర్సిటీలో చదివిన వాళ్లే ఉన్నారని అన్నారు.రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనేనని.. మహానాడు-2025 చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా టీడీపీది అదే జోరు అని అన్నారు.

కడపలో మహానాడు ఏపీ దశ దిశను నిర్దేశిస్తుందని.. కడప జిల్లాలో 10స్థానాలకు 7 గెలిచి సత్తా చాటామని, వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే స్వీప్‌చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించామని.. కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నామని.. టీడీపీ పని అయిపోయిందని చెప్పిన పార్టీలు..అడ్రస్‌ లేకుండా పోయాయని అన్నారు.