
వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రౌడీలకు విగ్రహాలు పెడతారా.. . ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. చంపండి, నరకండి అంటూ ఎవరైనా మాట్లాడతారా, హింసను ప్రాత్రసహిస్తూ పోలీసులపై నిందలు మోపుతారా అంటూ మండిపడ్డారు చంద్రబాబు. తమ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయలేదని, చట్టం తన పని తానూ చేస్తోందని అన్నారు చంద్రబాబు.చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లను ఏమనాలి.. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించారు చంద్రబాబు.
రౌడీయిజం, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లను హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని.. ఒకవైపు యోగాడే జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారని అన్నారు. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లను బలి ఇచ్చేటప్పుడు రప్పా రప్పా అనేవారని అన్నారు చంద్రబాబు. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోమని... ఒకప్పుడు నేరస్తులతో దూరంగా ఉండేవాళ్లం... ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజకీయాలు చేయాల్సి వస్తోందని అన్నారు చంద్రబాబు.
Also Read : ఏపీలో ప్రతి ఒక్కరి ఆలోచన అమరావతిపైనే ఉంది
బుధవారం ( జూన్ 18 ) సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలను ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. సత్తెనపల్లిలో పర్యటనకు ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా సింగయ్య అనే వృద్ధ రైతు కారు కింద పడి చనిపోవడం, తొక్కిసలాట ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.