సీఎం కేసీఆర్, కేటీఆర్ దేశ ద్రోహులు : ఎంపీ ధర్మపురి

సీఎం కేసీఆర్, కేటీఆర్ దేశ ద్రోహులు : ఎంపీ ధర్మపురి

ఎంఐఎంతో జతకట్టిన టీఆర్ఎస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు దేశ ద్రోహులేనన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశమంతా సంబురాలు చేసుకుంటే… కవిత బాధతో ట్వీట్ చేసిందన్నారు. గుండారం ఘటనపై ఇప్పటికే హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. బీజేపీ నేతలతో కలిసి గుండారం గ్రామాన్ని సందర్శించారు అర్వింద్.