రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ..

రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో గురువారం రోజు (ఆగస్టు 24న) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా.. రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.  రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ చర్చించారు. 

ఆర్టీసీ బిల్లు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ఆమోదంపైనే చర్చించినట్లు టాక్ నడుస్తోంది. కొన్ని రోజులుగా రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ నడుస్తున్న సమయంలో గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత గవర్నర్తో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల భేటీ తర్వాత.. పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని తెలుస్తోంది. తర్వాత సీఎం కేసీఆర్‌, కేబినెట్‌మంత్రులతో కలిసి గవర్నర్‌ గ్రూప్‌ ఫొటో దిగడం విశేషం.