
ప్రఖ్యాత నటుడు, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కాంతారావు.. 400 వందలకు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారని, వారు సినీ కళారంగానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్,ఏఎన్నార్ లు రెండు కండ్లయితే కాంతారావు ‘నుదుట తిలకం’గా ఖ్యాతి గడించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు.