కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: సీఎం కేసీఆర్

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: సీఎం కేసీఆర్

కొండగట్టు ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశమే నివ్వెర పోయేలా ఆలయాన్నినిర్మిస్తామన్నారు. తానే వచ్చి నిర్మాణాలను మొదలు పెడతామన్నారు. అంజన్న ఆలయానికి ఇప్పటికే 384 ఎకరాలు ఇచ్చామన్నారు. ప్రఖ్యాత స్థపతులను తీసుకొచ్చి కొండగట్టును డెవలప్ చేస్తామన్నారు. యాదాద్రి క్షేత్రం వలే కొండగట్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు.

జగిత్యాల జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే..జగిత్యాల జిల్లా అయిందన్నారు. రాష్ట్రం కోసం ఉద్యమం జరిగే సమయంలో ధర్మపురి వచ్చినప్పుడు గోదావరి పుష్కరాలు ఇక్కడ ఎందుకు జరగకూడదని సింహలా గర్జించానని చెప్పారు.