ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గుడ్న్యూస్ చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే జీతాలను పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘తెలంగాణలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం పోరాటం చేశాయి. ఆ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిది. ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని కాపాడుతాం. ఆర్టీసీ కోసం బడ్జెట్లో రూ. 3000 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లే.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతాం. రవాణా శాఖ మంత్రితో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.