తెలంగాణాలో స్విగ్గీ జొమాటో బ్యాన్

తెలంగాణాలో స్విగ్గీ జొమాటో బ్యాన్

స్విగ్గీ, జొమాటోల ఫుడ్ డెలివ‌రీ పూర్తిగా నిషేధించాల‌ని తెలిపారు సీఎం కేసీఆర్. రేప‌టి నుంచి వీటి నిషేధం పూర్తిగా అమ‌ల్లోకి రానుంద‌న్నారు. లాక్ డౌన్ పై ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం.. ఇంటింటికి తిరిగి ఫుడ్ ఇవ్వ‌డంతో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్నారు. ఈ 15 రోజులు బయటి పదార్థాలు(ఫుడ్‌) జోలికి వెళ్లవ‌ద్ద‌ని, ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదన్నారు.

ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలని.. రంజాన్‌ మాసం అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు. అన్ని మతాల్లో సామూహిక కార్యక్రమాలు, ప్రార్థనలకు అనుమతి లేదన్న సీఎం.. ఇప్పటి వరకు ప్రజలు మంచి సహకారం అందించారన్నారు. శానిటైజేషన్‌, పారిశుద్ధ్యం పనులు బాగా జరుగుతున్నాయని.. గ్రామాల నుంచి పట్టణాల దాకా ఎవరికి వారు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు సీఎం కేసీఆర్.