హైదరాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలపై CM సీరియస్

హైదరాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలపై CM సీరియస్

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం సీఎం కేసీఆర్ పాల్గొనాల్సిన లోక్ సభ ఎన్నికల టీఆర్ఎస్ ప్రచార బహిరంగ సభ అర్ధాంతరంగా ముగిసింది. మిర్యాలగూడలో సభ తర్వాత ఎల్బీ స్టేడియం సభకు సీఎం హాజరు కావాడం షెడ్యూల్ లో ఉంది. ఐతే… సీఎం కేసీఆర్ మిర్యాలగూడ సభ తర్వాత.. నేరుగా హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని.. ప్రగతి భవన్ వెళ్లిపోయారు.

అంచనాలకు అనుగుణంగా జనాలు రాకపోవటంతో ఎల్బీ స్టేడియంలో సభను ముందస్తుగానే ముగించారు మంత్రులు. సభ నిర్వహించిన తీరు… జన సమీకరణలో లోపాలపై హైదరాబాద్ మంత్రులు,ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.