
- తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
- ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క అయుధం
- ఓటు వేసే ముందు అభ్యర్థల గుణగణాలు, పార్టీల చరిత్ర గమనించాలి
- ఓటు అనేది తలరాతను మారుస్తుంది
- ఓటు అనేది ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుంది
- బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం
- ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్
- 58 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం
- 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను గమనించాలి
- కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేదు
- రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ , బీఆర్ఎస్
- ధరణి పోతే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి
- రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ
- మూడోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు రూ. 16 వేలకు పెంచుతాం
- కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యం
- కాంగ్రెస్ గెలిచాక కర్ణాటకలో ఏం జరుగుతుందో అందిరికీ తెలుసు
- తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కర్ణాటక పరిస్థితులే
- రోహిత్ రెడ్డి నిజాయతీ మనిషి
- ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తే దాన్ని తిప్పికొట్టిండు