ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు సంఘమేశ్వర - బసవేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ వారంలోనే ముఖ్యమంత్రి మహారాష్ట్ర, కర్నాటక పర్యటనకు వెళ్లే అవకాశముంది. కర్నాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ, మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇరువురు నేతలతో సీఎం జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేతకంగా పోరాటానికి సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్కు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ స్వయంగా ఫోన్ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్ త్వరలోనే బెంగళూరు వచ్చి కలుస్తానని దేవెగౌడకు చెప్పారు.