18న కుటుంబ సమేతంగా మేడారానికి సీఎం కేసీఆర్ 

18న కుటుంబ సమేతంగా మేడారానికి సీఎం కేసీఆర్ 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ 4 రోజుల షెడ్యూల్ను సీఎంఓ విడుదల చేసింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి మేడారం వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని.. రోజంతా అమ్మవార్ల సన్నిధిలోనే గడపనున్నారు. జాతరలో భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీఆర్ ఈ నెల 20న ముంబైకి వెళ్లనున్నారు. 21,23 తేదీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. 21న నారాయణఖేడ్లోని సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 23న కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

అజిత్ దోవల్ ఇంట్లోకి చొరబాటు యత్నం

కస్టమర్ల గోల్డ్తో బెట్టింగ్