ఏపీ టెండర్లు వాయిదా పడినంక మీటింగ్ ఎందుకు?

ఏపీ టెండర్లు వాయిదా పడినంక మీటింగ్ ఎందుకు?

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘శ్రీశైలం నుంచి నీళ్లన్నీ తోడుకుపోయేలా ఏపీ సర్కారు చేపడ్తున్న పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టుస్కీమ్లకు ఈ నెల 19న టెండర్లు పూర్తవుతయి. కానీ సీఎంకేసీఆర్ మాత్రం ఈ ప్రాజెక్టులపై కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్​మీటింగ్ను 20వ తేదీ తర్వాత నిర్వహించాలని అంటున్నరు. అదే 5వ తేదీనే మీటింగ్ జరిగితే.. ఏపీ నీటి తరలింపును వ్యతిరేకించాల్సి వస్తుందనే ఇట్లచేస్తున్నరు. దీన్ని బట్టి జగన్‌‌తో కేసీఆర్‌‌ కుమ్మక్కయ్యారని అర్థం అవుతోంది. కేసీఆర్ .. తెలంగాణకు ద్రోహం చెయ్యకు..” అని బీజేపీ కోర్‌‌కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్‌‌వెంకటస్వామి మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి ఆదేశాల మేరకే సీఎం కేసీఆర్‌‌ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు వీడియో రిలీజ్‌ చేశారు.

‘మేఘా’ చేయించిన ఒప్పందంతోనే సైలెంట్‌

కేసీఆర్‌‌, జగన్‌ ‌మధ్య కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి ఒప్పందంచేశారని వివేక్ ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌‌పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టు ద్వారా నీటిని దోచుకుపోతున్నారని.. అయినా ఒప్పందం వల్లే కేసీఆర్‌‌మౌనంగా ఉన్నారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు నీటి దోపిడీని అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ సంజయ్‌ ‌కేంద్రానికి లెటర్‌‌రాశారని, దీనిపై కేంద్రం స్పందించి మీటింగ్ ఏర్పాటు చేసిందని చెప్పారు. అసలు సీఎంకేసీఆర్ ఈ పని చేయాల్సిందని, సుప్రీంకు వెళ్లి స్టే తేవాల్సిందన్నారు. అలా కాకుండా కల్లబొల్లి మాటలు చెప్పి కేంద్ రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘‘కరోనాపై రివ్యూ చేయడానికి టైంలేదు. ఏపీకి నీళ్లు దోచుకుపోతుంటే ఆపడానికి టైముండదు. కానీ సెక్రటేరియట్‌‌ కూల్చడానికి, కొత్తది కట్టించడానికి మాత్రం మస్తు టైం ఉంటదా?’’ అని వివేక్‌‌ నిలదీశారు.ఇప్పటికే 60 వేల కోట్ల నష్టంప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ఆరేండ్లలో 60 వేల కోట్లను రాష్ట్రప్రజలకు నష్టం చేశారని వివేక్‌‌మండిపడ్డారు. ఆ డబ్బులతో పాలమూరు లిఫ్టు, ఎస్‌‌ఎల్‌‌బీసీ పూర్తి చేసుకుని ఉండొచ్చని, జూరాల కెపాసిటీని పెంచుకోవచ్చని చెప్పారు. కానీ కమీషన్లకోసంకాళేశ్వరంవ్యయంపెంచి , ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. నాడు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచి .. కేసీఆర్ తప్పుపట్టారని, మరి ఇప్పుడు ఏకంగా 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నా నోరెత్తడం లేదేమని నిలదీశారు.