
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సెక్రటేరియెట్లో మంత్రులు, కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లతో సీఎం కేసీఆర్ గురువారం కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పోడు పట్టాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, బీసీ సబ్సీడీ లోన్లపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు, కార్యాచరణను కలెక్టర్లకు వివరించనున్నారు.