కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పొగొట్టుకున్న, అపహరణకు గురైన 112 సెల్ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర గురువారం తెలిపారు. రికవరీ చేసిన సెల్ఫోన్ల విలువ రూ.18 లక్షల వరకు ఉంటుందన్నారు. సీఈఐఆర్ పోర్టర్ద్వారా ప్రతి నెలా జిల్లాలో 150 వరకు సెల్ఫోన్లను రికవరీ చేస్తున్నామన్నారు. సెల్ఫోన్ పోయినా, చోరీకి గురైనా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.
సీఈఐఆర్ పోర్టర్లో ఐఎంఐ నంబర్ బ్లాక్ చేసి ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించవచ్చన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.3 కోట్ల విలువైన 1,834 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సెల్ఫోన్ల ద్వారానే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
