రేగొండ, వెలుగు: వ్యవసాయ అనుంబంధ పరిశ్రమలతో గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు వెళ్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. గురువారం రేగొండ మండలం భాగిర్థిపేటలో కొత్తగా నిర్మాణం పూర్తి అయిన రైస్మిల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పాడిపరిశ్రమ, మిల్లింగ్ వ్యాపారంతో స్థానికంగా ఉండే రైతులకు రవాణా ఖర్చుల భారం తగ్గడంతో పాటు కూలీలకు ఉపాధి దొరుకుతుందన్నారు.
ఈ పరిశ్రమలకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రెండేళ్ల కాలంలో అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. నాయకులు గూటోజు కిష్టయ్య, ఎండీ షబ్బిర్, నాయినేని సంపత్రావు, నడిపెల్లి విజ్జన్రావు, ఎర్రబెల్లి రవీందర్రావు, పెండెల ఉపేందర్ పాల్గొన్నారు.
