సాయంత్రం వరంగల్ వెళ్లనున్న సీఎం కేసీఆర్

సాయంత్రం వరంగల్ వెళ్లనున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం వరంగల్ కు వెళ్లనున్నారు. భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో  వరద పరిస్థితిపై ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. రాత్రికి హన్మకొండలో బస చేయనున్న కేసీఆర్.. రేపు ఉదయం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా కడెం నుంచి భద్రాచలం వరకు నెలకొన్న పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సహాయ కార్యక్రమాలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించే అవకాశముంది. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు సమాచారం.