
కొడంగల్, వెలుగు: కొడంగల్సెగ్మెంట్ను మెడికల్హబ్గా మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్లో పర్యటించిన ఆయన నర్సింగ్కాలేజీ, 220 బెడ్స్ హాస్పిటల్ను తనిఖీ చేశారు. కొడంగల్ వైద్య కాళాశాలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ఇవ్వడం హర్షణీయమన్నారు. అనంతరం నర్సింగ్కాలేజీ విద్యార్థినులతో మాట్లాడారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్తదితరులున్నారు.