
అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి లోకల్ సెంటిమెంట్ ను గౌరవించడంతో పాటు స్థానిక నిపుణులు,పూజారుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మేడారం అభివద్ధికి సంబంధించిన పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమం త్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించా రు.
ఈసందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆల యాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచంలో అతి పెద్ద గిరిజన పండుగకు సంబంధించి నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో చారిత్రాత్మకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తు లకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు.
►ALSO READ | తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్: డిప్యూటీ సీఎం భట్టి
భవిష్యత్అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్లని ర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారం ప్రాంతానికి వచ్చి క్షేత్రస్థాయి. పరిశీలన చేస్తానని పేర్కొన్నారు. దీనితో పాటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన ముఖ్య మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క పొంగులేటి శ్రీనివాస్డ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.