
- చెరుకు రైతులకు చక్కెర ఫ్యాక్టరీ
- బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పునరుద్ధరణ
- జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ.100 కోట్లు
- హజ్ హౌజ్, షాదీఖాన, అంతర్గత రోడ్లకు రూ.72 కోట్లు
సంగారెడ్డి/జహీరాబాద్/ఝరాసంగం, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం జహీరాబాద్నియోజవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హుగ్గెల్లి చౌరస్తా వద్ద మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామ శివారులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, నీమ్జ్ 9.5 కిలో మీటర్ల ఫోర్లైన్ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుంచి పస్తాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభావేదికకు చేరుకొని ప్రాంగణం వద్ద వివిధ శాఖల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు.
అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, సంజీవ్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రతిపాదనల మేరకు సీఎం రేవంత్వేల కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు, డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.126.54 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గిరిధర్రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, ఫయీం, కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి చంద్రశేఖర్, నాయకులు ఉజ్వల్రెడ్డి, తన్వీర్, హన్మంత్రావు పాటిల్, శ్రీనివాస్రెడ్డి, రామలింగారెడ్డి, భాస్కర్రెడ్డి, కండెం నర్సింహులు, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నీమ్జ్ ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీ
జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల ప్రజలకు సీఎం పలు హామీలను ఇచ్చారు. నీమ్జ్ ప్రతిపాదిత ప్రాంతంలో 100 ఎకరాల్లో సహకార చక్కెర ఫ్యాక్టరీ, కోహీర్లో డిగ్రీ కాలేజ్, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్కు ఫండ్స్, జహీరాబాద్లో హజ్హౌజ్, షాదీఖాన, జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ. 100 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పంచాయతీని రెండో మండల కేంద్రంగా అప్గ్రేడ్ చేసేందుకు హామీ ఇచ్చిన సీఎం వీటన్నంటిపై సమీక్షించి నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండలం బోరంచ వద్ద నిర్మించనున్న బసవేశ్వర లిఫ్ట్ఇరిగేషన్ పునరుద్ధరణకు నిధులు, ఖేడ్ ప్రాంతంలో ఉపాధి కోసం ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం సీఎం సుముఖత వ్యక్తం చేశారు.
సభ సక్సెస్
జహీరాబాద్ పస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సీఎం సభ సక్సెస్ అయింది. ఎంపీ సురేశ్షెట్కార్ అధ్యక్షతన కొనసాగిన ప్రజావేదిక సభకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. రూ. 494.67 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగగా, సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, దామోదరరాజనర్సింహ, ఎమ్మెల్యేలు మాణిక్రావు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో సభాప్రాంగణం కిక్కిరిసి పోయింది. అలాగే సభాస్థలి వద్ద కళాజాత బృందాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాడిన పాటలు ప్రజలను ఆలరించాయి.