హైదరాబాద్ , వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజు(ఈ నెల 8న) సందర్భంగా రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 57 కిలోల సన్న బియ్యంతో ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. ఆదివారం దీనిని సీఎంకు బర్త్డే గిఫ్ట్గా అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోర్ట్రెయిట్ను మెట్టు సాయికుమార్ శుక్రవారం మీడియా ముందు విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.."సన్న బియ్యం పథకం పేదలకు రేవంత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి. ఈ బియ్యం తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుండేలా.. నేను సన్న బియ్యంతో రేవంత్ చిత్ర పటాన్ని తయారు చేసి సీఎంకు శుభాకాంక్షలు చెప్తాను. ఆయనపై నాకున్న అభిమానాన్ని చాటుకుంటాను" అని మెట్టు సాయి పేర్కొన్నారు.
