
ఏపీ చేపడుతోన్న బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష ఎంపీలతో తెలంగాణ సచివాలయంలో ఇరిగేషన్ శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తోంది. బనకచర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.
సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్,రేణుకా చౌదరి,ఎంపీ చామల, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎంఐఎం ఎంపీ ఓవైసీ, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రన్ హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కాలేదు.
►ALSO READ | బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్లకు క్లియరెన్స్ : ఎంపీ అర్వింద్
ఈ సందర్బంగా మాట్లాడిన ఉత్తమ్.. బనకచర్లపై కేంద్రానికి ఏపీ ఫ్రీ ఫిజిబులిటీ సమర్పించిందన్నారు.ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పారు.అన్ని పార్టీలను మేము సంప్రదించాం.. బనకచర్లపై అన్ని పార్టీల ఎంపీల అభిప్రాయాలు కీలకమన్నారు. సీఎం సూచనలతో అఖిలపక్ష ఎంపీల సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.