
గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినం. కానీ ఇప్పుడు మేం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే.. కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. మేం పరీక్షల సిలబస్ మార్చలేదు. పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ రెండేండ్ల కింద ఇచ్చింది. అది అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. అయినా మళ్లీ వాయిదా వేయాలని కోరుతున్నారు. వాయిదాలు వేస్తూ పోతే ఈ రెండేండ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ల పరిస్థితేంటి? ఇప్పటికే ఉద్యోగాలు రాక వాళ్లు నిరాశలో ఉన్నారు.
- సీఎం రేవంత్ రెడ్డి