ఖైరతాబాద్,వెలుగు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పేరిట కోకాపేటలో నిర్మించిన రాష్ట్ర కురుమ సంఘం భవనాన్ని ఈనెల18న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్లు కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం ప్రారంభానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
హర్యానా గవర్నర్బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్, సంఘం జనరల్సెక్రటరీ బండారు నారాయణ, సెక్రటరీ కొలుకుల నర్సింహ, కోశాధికారి కట్టా మల్లేశం,యూత్ అధ్యక్షుడు తూముకుంట అరుణ్కుమార్, మహిళా ప్రతినిధులు బాలమణి, విజయలత, సునీత, విజయ, శారద పాల్గొన్నారు.
