
హైదరాబాద్ సిటీ/గాంధీ దవాఖాన, వెలుగు : ప్రజల ఆరోగ్య పరిరక్షణను పట్టించుకోని అధికారులను సస్పెండ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడంతో వైద్యారోగ్య శాఖలో కదలిక వచ్చింది. మంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం వైద్యశాఖ ఉన్నతాధికారులు దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ గాంధీ దవాఖానను, డీఎంఈ వాణి కోఠి జిల్లా దవాఖానను, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఫీవర్ హాస్పిటల్ను, పబ్లిక్హెల్త్ఆఫీసర్ ఉస్మానియా దవాఖానను సందర్శించారు.
జ్వర కేసుల నమోదుపై ఆరా తీశారు. ఆయా దవాఖానల్లో వసతులు, పరికరాలు, మందుల నిల్వ వంటివి అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడారు. గాంధీలో వైద్య విధాన పరిషత్ కమిషనర్డాక్టర్ జే.అజయ్ కుమార్ మాట్లాడుతూ.. జ్వరం కేసులు పెరుగుతున్నప్పటికీ డెంగీ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం గాంధీలో 43 మంది జ్వరానికి ట్రీట్మెంట్ పొందుతుండగా, ఇందులో ఏడు డెంగీ కేసులు, మరో నాలుగు చికున్గున్యా కేసులున్నట్లు తెలిపారు. అధికారులు గురువారం కూడా హైదరాబాద్ శివారులోని దవాఖానల్లో పర్యటించనున్నారు.