రెండో రోజు ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్

రెండో రోజు ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్

ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతుంది. నిన్న AICCలో జరిగిన మీటింగ్ పాల్గొని...ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు UPSC చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలవనున్నారు సీఎం రేవంత్. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, CS శాంతి కుమారితో పాటు మరో ఇద్దరు IAS అధికారులు మనోజ్ ని కలుస్తారు.

 UPSC పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేయనుంది సీఎం రేవంత్ టీం. కేరళలో ఇప్పటికే పర్యటించి...అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించింది IASల బృందం. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.