విజృంభిస్తోన్న వైరల్ ఫీవర్స్.. వైద్యాధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

విజృంభిస్తోన్న వైరల్ ఫీవర్స్.. వైద్యాధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్ పేషెంట్ల తాకిడితో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ దాదాపు నిండిపోయాయి. రాష్ట్రంలో విష జ్వరాలు విభృంభిస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

వెంటనే ఉన్నతాధికారులు ఆసుపత్రులను సందర్శించి.. రోగులకు అందుతోన్న వైద్య ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పబ్లిక్ హెల్త్ డైర్టెక్టర్ రవీంద్ర నాయక్ అండ్ టీం హైదరాబాద్‎లోని ఉస్మానియా మెడికల్ హాస్పిటల్‎ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించి.. రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Also Read:-యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తే రూ. 8లక్షలు

 మరోవైపు వైద్య విధాన పరిషత్ కమిషనర్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతోన్న వైద్య సేవలపై డాక్టర్లను ఆరా తీశారు. పలువురు రోగులతో మాట్లాడి.. వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ, మలేరియా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని వైద్యులకు ఆయన సూచించారు. హైదరాబాద్‎తో పాటు పలు జిల్లాలోనూ వైద్య అధికారులు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు.