సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం.. కాళేశ్వరంలో సీఎం రేవంత్ పుష్కర స్నానం..ఎప్పుడంటే..

సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం..  కాళేశ్వరంలో సీఎం రేవంత్ పుష్కర స్నానం..ఎప్పుడంటే..

సరస్వతి నది పుష్కరాలు  మే 15న ప్రారంభం కావడంతో  తెలంగాణలోని కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభ సంతరించుకుంది. ఈ ఉదయం  ( మే 15) తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ప్రారంభం అయ్యాయి.  సరస్వతీ పుష్కరాలు ఈ నెల 26 వరకు సాగనున్నాయి. కాళేశ్వరం వద్ద త్రివేణీ సంగమంలో పుష్కర స్నానం.. ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సీఎం రేవంత్ ఈ సాయంత్రం పుష్కర స్నానం చేయనున్నారు.

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరిణి వద్ద రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ ప్రాంతంలో మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.

పుష్కరాల సమయంలో ప్రతి రోజూ దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.  భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు.అదనంగా, సాంస్కృతిక, కళాపరమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 

ఈ రోజు  మే 15 సాయంత్రం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సతీమణితో కలిసి కాళేశ్వరం చేరుకోనున్నారు. పుష్కర యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన 86 గదుల వసతి సముదాయాన్ని ప్రాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.  పుష్కర స్నానాన్ని ఆచరించి, శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. సరస్వతి నదికి నిర్వహించే ప్రత్యేక హారతిలో పాల్గొని..  అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల వసతి సముదాయాన్ని ఆయన ప్రారంభిస్తారు. కాళేశ్వరం పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎం‌గా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతున్నారు.  ఈ పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.