- కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు
రాయికల్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు యువత, మహిళలు మద్దతుగా నిలవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. రాయికల్ లోని గుడేటి రెడ్డి సంఘ ఆవరణలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత పడిగెల నరసింహ, బీజేపీ నాయకుడు కొత్తపెల్లి అరవింద్ తమ 40 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు రవిందర్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి జరుగుతోందని, సంక్షేమ పథకాలు సమానంగా అందుతున్నాయని అందుకే మహిళలు, యువత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం విద్య, వైద్యానికి హబ్గా మారిందన్నారు. రూ.232కోట్లతో నూతన ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభమయ్యే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 25వందల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నదని చెప్పారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మోర హన్మండ్లు, వైస్చైర్పర్సన్ గండ్ర రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
