వైఎస్సార్ కు కుటుంబ సభ్యుల నివాళి

వైఎస్సార్ కు కుటుంబ సభ్యుల నివాళి

ఏపీ దివంగత మాజీ  సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్బంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సీఎం జగన్ , భారతి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాళి అర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరో వైపు వైఎస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ  కార్యకర్తలు నివాళి అర్పించి, పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.    

ఎడమొహం పెడమొహంగానే..

నిరుడు ఇడుపులపాయలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి షర్మిల, జగన్ వేర్వేరుగా వచ్చారు. ఈసారి మాత్రం అందరూ కలిసి వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.  అయితే అక్కడ  షర్మిల, జగన్ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.  కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నట్లు కనిపించలేదు.